భీమవరం ప్రజలకు పాల్ పీడ తొలగింది.. !


ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చేస్తున్న వింతలెన్నో. విచిత్రమైన పనులతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు ఆయన ఆలస్యంగా రావడంతో అధికారులు నామ పత్రాలు తీసుకోలేదు. తన తరఫున ఓ ప్రతినిధి పూర్తి పత్రాలతో మధ్యాహ్నం 2.40 గంటలకు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లాడన్నారు. అనంతరం కొద్దిసేపటికే తాను అక్కడికి చేరుకున్నప్పటికీ సమయం అయిపోయిందంటూ తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు పాల్. తాను నామినేషన్‌ వేయకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు.

తాను భీమవరంలో పోటీ చేస్తున్నానంటే పవన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. నర్సాపురం పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన ఏడాది కాలంలో నర్సాపురాన్ని నార్త్‌ అమెరికాలా మార్చేస్తాన్నారు. అధునాతన వైద్యంతో కూడిన వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నర్సాపురంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. తన పార్టీ గుర్తు హెలికాప్టర్‌ కావడంతో తుప్పు పట్టిన ఫ్యాన్‌కు ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. మొత్తంగా భీమవరం ప్రజలకి పాల్ ఫీట్లు తప్పినట్టయింది.