సీఎం సభకు 2లక్షల మంది

ఎన్నికల వేళ తెరాస భారీ బహిరంగ సభలని నిర్వహిస్తోంది. ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. 16 ఎంపీ స్థానాలని గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వీటికితోడు కేసీఆర్ మరో 140మంది ఎంపీలని మాట్లాడి పెట్టారు. తద్వారా కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందుకే దేశానికి చౌకీదార్‌ కాదు.. జిమ్మేదారు కావాలిని కేటీఆర్ పిలుపునిస్తున్నారు.

ఇక, ఏప్రిల్ 2న వరంగల్‌ జిల్లా ఆజంజాహి మిల్లు మైదానంలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా, సభ ఏర్పాట్లని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ‘గతంలో ఇక్కడి సభలో పాల్గొన్న పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారన్నారు. ఈ సెంటిమెంట్‌ కొనసాగుతుంది. కేసీఆర్ ప్రధాని అవుతారని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ సభకు దాదాపు 2లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.