ముదిరిన ఈసీ వార్.. ఎస్పీలు లేఖాస్త్రాలు !

ఏపీలో ఈసీ వార్ ముదురుతోంది. ఎన్నికల వేళ.. ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ తో పాటు, కడప, శ్రీకాకుళం ఎస్పీలని ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు, వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి ఫుల్ బెంచ్ ఎన్నికల సంఘం ముందు హాజరుకానున్నారు.

ఇదిలావుండగా.. ఈసీ బదిలీ చేసిన కడప, శ్రీకాకుళం ఎస్పీలు తమ బదిలీకి కారణాలు చెప్పాలని ఈసీకి లేఖలు రాశారు. తనపై వచ్చిన ఫిర్యాదులని నిరూపించాలని కడప ఎస్పీ రాహుల్ దేవ్ లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తాను తప్పు చేయలేదని తేలితే తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం వెంకటరత్నం లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఈసీపై బదిలీలపై దాఖలైన పిటిషన్స్ ఇవాళ విచారణకు రానున్నాయి.