తెరాసలో చేరిన సునీత లక్ష్మారెడ్డి

మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెరాసలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆమె తెరాస తీర్థం పుచ్చుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో క‌ష్టపడి ప‌నిచేసే వారికి గుర్తింపు లేదు. మెద‌క్ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డానికే తెరాసలో చేరినట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేతలకే విశ్వాసం లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో న‌ర్సాపూర్ భూములు స‌స్యశ్యామ‌లం అవుతాయ‌నే నమ్మకం ఉందన్నారు సునీతా లక్ష్మారెడ్డి. కార్యకర్తలంతా కలిసి మెలిసి ఉండాలని ఆమె కోరారు.