కాలీనడకన తిరుమలకు చేరుకున్న సమంత

హీరోయిన్ సమంత శ్రీవారి దర్శనం కోసం కాలీ నడకన తిరుమల చేరుకొన్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొన్నారు. సమంతతో పాటు మజిలీ చిత్రబృందం కూడా రేపు శ్రీవారిని దర్శించుకొన్నారు. ఐతే, సామ్ ఒక్కరు మాత్రమే అలిపిరి నుండి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సమంత-నాగచైతన్య భార్యభర్తలుగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకుడు. ఈ వారమే (ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటన హైలైట్ గా ఉండనుందట. ఇక, చైతూ నటన ప్రేక్షకులకి షాక్ ఇచ్చేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.