ట్రైలర్ టాక్ : జై లవ కుశ.. అదిరిపోయింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ టీజర్ బయటికొచ్చేసింది. అభిమానులని షేక్ చేస్తోంది. ఆదివారం హైదరాబాద్’లో ‘జై లవ కుశ’ ట్రైలర్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో తారక్ నట విశ్వరూపాన్ని చూపించాడు. అదీ కూడా త్రిమూర్తుల రూపంలో. మూడు పాత్రల్లో తారక్ ఒదిగిపోయిన విధానం అద్భుతం. ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు రాముడు, లక్ష్మణుడు, భరత్ లు ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. వీళ్లు మాత్రం రామ-లక్ష్మణ, రావణులుగా ఉన్నారని ట్రైలర్ లో స్టోరీ లైన్ చెప్పేశాడు దర్శకుడు బాబీ. చివరల్లో ‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ఛాలెంజ్ విసిరాడు తారక్.

ఎన్టీఆర్ కు జాతీయ అవార్డు ఖాయం :
జై లవ కుశ సినిమాతో తమ్ముడు ఎన్టీఆర్’కు జాతీయ అవార్డు రావడం ఖాయమని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు. ఎన్టీఆర్ బాబీని ఎందుకు దర్శకుడుగా పెట్టుకొన్నాడు. టాప్ దర్శకుడితో సినిమా చెయొచ్చు కదా.. ? అనే మాటలు వినిపించాయి. మేం బాబీని నమ్మలేదు. ఆయన చెప్పిన కథని నమ్మాం. ఓ అద్భుతమైన కథతో సినిమా తీయాలని భావించాం. ఈ సినిమాతో తారక్ కి జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నా. అప్పుడు మళ్లీ పెద్దగా సెలబ్రేట్ చేసుకొందాం అన్నారు కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్.. ఓ నట సముద్రం :
‘ఎన్టీఆర్ ఓ నట సముద్రం. ఆ సముద్రంలో నుంచి ఒక చెంబు నీళ్లని తాను, ఓ బకెట్ నీళ్లని కొరటాల శివ తీసుకువెళ్లాం. ఇప్పుడు దర్శకుడు బాబీ మాత్రం ఏకంగా ఓ ట్యాంకర్ నీళ్లు పట్టుకువెళుతున్నాడు” అన్నారు దర్శుకుడు సుకుమార్. ఎన్టీఆర్ – సుకుమార్ ల కలయికలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.