శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని దంపతులు

అక్కినేని దంపతులు నాగ చైతన్య-సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. సోమవారం రాత్రియే ‘మజిలీ’ చిత్రబృందం తిరుమల చేరుకొంది. సమంత మాత్రం కాలీనడకన తిరుమల కొండని ఎక్కారు. కేవలం రెండుగంటల్లోనే సామ్ తిరుమల కొండ ఎక్కడం విశేషం. ఇవాళ ఉదయం సామ్-చై కలిసి శ్రీవారి దర్శనం చేసుకొన్నారు. వీరితో పాటు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కూడా శ్రీవారిని దర్శించుకొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

ఇదిలావుండగా.. పెళ్లి తర్వాత సామ్-చై తొలిసారి జంటగా నటించిన చిత్రం మజిలీ ఈ వారమే (ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నటిగా సమంతకి రావాల్సిన పేరు వచ్చేసింది. చైతూ మాత్రం ఇంకా తనని తాను నిరూపించుకోవాల్సివుంది. స్టార్ హీరోగా ఎదగాల్సివుంది. ఆయనకి ‘మజిలీ’ సినిమా మంచి టర్న్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.