మట్టిపనికైనా ఇంటోడే ఉండాలె : కేసీఆర్

మట్టిపనికైనా ఇంటోడే ఉండాలె. కాంగ్రెస్ నేతలని గెలిపిస్తే.. వాళ్లు ఢిల్లీ నేతల కాళ్లు ఒత్తుతరు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించాం. మట్టికైనా ఇంటోడే కావాలె.. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెరాసని 16స్థానాల్లో గెలిపించండి. కేంద్రంలో గట్టిగా ఉండి. కేంద్ర రాజకీయాలని శాసించే బాధ్యత నాది అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

మంగళవారం సాయంత్రం కేసీఆర్ భువనగిరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు ఇక్కడి వచ్చి అభివృద్దిపై మాట్లాడుతున్నరు. 60యేళ్లు దేశాన్ని కాంగ్రెస్ పాలించలేదా ? ఎందుకు అభివృద్ది చేయలేదు. వీరికి చేతకాదు. ఇక్కడికొచ్చి.. కేసీఆర్ ముక్కు దొడ్డుగుంది. మూతి పెద్దగుంది అంటారు. దేశంలోనే ఎక్కడా రైతుబంధు పథకం లేదు. 24గంటలు రైతులకి ఉచిత కరెంట్ ఇస్తున్నం. ఆలోచించి వేటెయండీ. దేశం పరిస్థితి రావాలె. ఇందుకోసం ఎవరో ఒకరు పిడికిబిగించాలె. మీరు ఆశీర్వదిస్తే.. నేను కొట్లాడతా అన్నారు కేసీఆర్.