బెంగళూరు ప్లేఆఫ్‌ ఆశలు గల్లంతే !

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌ ఓడింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బెంగళూరును రాజస్థాన్ ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 4 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. పార్థివ్‌ పటేల్‌ (67; 41 బంతుల్లో 9×4, 1×6) చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రేయస్‌ గోపాల్‌ (4-1-12-3) అద్భుత బౌలింగ్‌తో బెంగళూరును కట్టిపడేశాడు. కోహ్లి, డివిలియర్స్‌, హెట్‌మయర్‌ లని అవుట్ చేశాడు.

జోస్‌ బట్లర్‌ (59; 43 బంతుల్లో 8×4, 1×6)తో పాటు స్టీవెన్‌ స్మిత్‌ (38; 31 బంతుల్లో 2×4, 1×6), రాహుల్‌ త్రిపాఠి (34 నాటౌట్‌; 23 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ (2/17), సిరాజ్‌ (1/25) గొప్పగా బౌలింగ్‌ చేశారు. బెంగళూరు వరుసగా నాలుగో పరాజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరో రెండు మ్యాచ్ ల్లో బెంగళూరు ఓడిపోతే.. ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే.