బెంగళూరు ఓటమి సిక్స్

బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ ఖాతాలో మరో ఓటమి. ఇప్పటికే ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మరోసారి ఓడిపోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కోహ్లీ 41, మోయిన్‌ అలీ 32 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబాడా 4, మోరిస్‌ 2, అక్షర్‌ పటేల్‌, లామిచ్చానే ఒక్కో వికెట్‌ తీశారు.

150 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ సునాయసంగా చేధించింది. 19ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొంది. శ్రేయస్‌ అయ్యర్‌ 67, పృథ్వీ షా 28, కొలిన్‌ ఇంగ్రామ్‌ 22 పరుగులతో రాణించారు. ఈ ఓటమితో బెంగళూరు ఓటమిలో సిక్స్ కొట్టినట్టయింది. అసలు ఈ టోర్నీలోనే బెంగళూరు గెలుపు బోణి కొడుతుందా ? లేదంటే గుండు సున్నా విజయాలతో టోర్ని నుంచి నిష్కరమిస్తుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.