‘చిత్రలహరి’ సెన్సార్ రివ్యూ

మెగా యంగ్ హీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ . సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 12న చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సింగిల్ కట్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ని పొందింది.

‘చిత్రలహరి’ రన్ టైంని 2గంటల 10 నిమిషాలుగా లాక్ చేశారు. సినిమా చాలా బాగుంది. జీవితంలో సక్సెస్ కోసం తేజు పడే ఆరాటం, పోరాటం యువతకి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో తేజు అద్భుతంగా నటించారు. సెటిల్డ్ ఫర్ ఫామెన్స్ తో అదరగొట్టాడని సినిమా చూసిన సెన్సార్ సభ్యుల టాక్. ఇక, ఈ సినిమాలో పాత సునీల్ కనిపిస్తాడట. మొత్తంగా.. చిత్రలహరి సెన్సార్ టాక్ సూపర్ హిట్ అని తెలిసింది. ఆ టాక్ నిజమైంత తేజు ఖాతాలో హిట్ పడినట్టే.