బర్త్ డే పార్టీలో మహేష్, తారక్.. ఫుల్ ఎంజాయ్ !

సూపర్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిస్తే అభిమానులకి పండగే. వీరిద్దరు మరోసారి కలిశారు. సోమవారం దర్శకుడు వంశీపైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు. ఈ సందర్భంగా వంశీ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి మహేష్, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి వచ్చారు. ఈ సందర్భంగా తీసుకొన్న ఫోటోలని మహేష్ తన ఇన్ స్ట్రో గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు వైరల్ అయ్యాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. చరణ్ కాలికి గాయం కావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కి మూడు వారాల బ్రేక్ పడింది. దీంతో తారక్ ని విశ్రాంత్రి దొరికింది. వంశీ ఆహ్వానించడంతో మాలిని బర్త్ డే పార్టీకి వచ్చి మహేష్ తో కలిసి ఎంజాయ్ చేశారు.