ముంబైలో ‘దర్భార్’ మొదలైంది


ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘దర్బార్’. మంగళవారమే ఈ సినిమా టైటిల్ ని ప్రకటించింది చిత్రబృందం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుధవారం రెగ్యూలర్ షూటింగ్ మొదలెట్టారు.
ఈ ఉదయం ముంబైలో దర్భార్ పూజా కార్యక్రమాలని ఘనంగా నిర్వహించారు. మొదటి షెడ్యూల్ ని ప్రారంభించారు.

ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. రజనీ జంటగా నయనతార జతకట్టనుంది. రజినీ కుమార్తె పాత్రలో నివేదా థామస్ కనిపించనుందని సమాచారమ్. 2020 పొంగల్ కి ‘దర్భార్’ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తొంది.