రాజమౌళి నుంచి నిత్యా మేనన్‌కు పిలుపు

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నుంచి నిత్యా మేనన్‌కు పిలుపొచ్చింది. ఆమెకు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించే అవకాశం వచ్చేలా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో మరో కథానాయిక కోసం రాజమౌళి అన్వేషణలో ఉన్నట్లు టాక్‌. బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్దాకపూర్, జాహ్నవి కపూర్ ల పేర్లు తెరపైకి వచ్చాయి.

తాజాగా, నిత్యామీనన్ పేరు వినిపిస్తోంది. నిత్యాకు రాజమౌళి నుంచి పిలుపొచ్చింది. దీంతో లుక్‌ టెస్ట్‌ కోసం ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా నటించబోతున్నారా? లేదా మరేదైనా కీలకమైన పాత్ర కోసం జక్కన్న సంప్రదించారా? అనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో ‘జనతా గ్యారేజ్’ కోసం ఎన్టీఆర్-నిత్యా జంటగా నటించారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.