ఓటేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు. ‘సైరా’ సినిమా జపాన్ షెడ్యూల్ ని ముగించుకొని మెగాస్టార్ ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆయన ఈసారి రాజకీయాలకి దూరంగా ఉన్నారు. జనసేన తరుపున మెగాస్టార్ ప్రచారం చేస్తారు. అదీ కుదరకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఓ ప్రెస్ మీట్ పెడతారనే ప్రచారం జరిగింది. కానీ, అసలు చిరు పొలిటిక్స్ ని టచ్ చేయలేదు.

మరోవైపు, మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు మాత్రం జనసేన కోసం తమ సంపూర్ణ మద్దతుని ప్రకటించారు. వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆయనతో కలిసి ఎన్నికల ప్రచార వేదికని కూడా పంచుకొన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైకాపాల మధ్యే అయినా.. జనసేన కింగ్ మేకర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.