ఓటు హక్కుని వినియోగించుకొన్న పవన్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలో పవన్ ఓటు వేశారు. ఏపీలోనూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని జనసేన భావిస్తోంది. టీడీపీ, వైకాపాలలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాదు. దీంతో తాము కీలక అవుతాము. పవన్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని జనసేన శ్రేణులు చెప్పుకొంటున్నారు.

ఇక, ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కుని వినియోగించుకొంటున్నారు. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, మోహన్ బాబు, విష్ణు.. తదితరులు ఓటేశారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో సినీ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయలు ఓటు వేశారు.