ఓటర్ ఓటు వేశాడు

హీరో మంచు విష్ణు ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. ఆయన తండ్రి, వైకాపా నేత మోహన్‌బాబుతో కలిసి చంద్రగిరి మండలం రంగంపేటలో ఓటేశారు. ఇటీవలే మోహన్ బాబు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. డైలాగ్ కింగ్ ప్రచారం వైకాపాకి ఏ మేరకు హెల్ప్ అయిందని చూడాలి.

ఇక, మంచు విష్ణు తాజా చిత్రం ఓటర్. ఈ చిత్రానికి జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. సురభి కథానాయిక. రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ నిర్మిస్తున్నారు. సమాజంలో మార్పురావాలంటే.. రాజకీయ నేతలని మార్చాలనే పాయింట్ తో ఓటరు తెరకెక్కింది. త్వరలోనే ఓటర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, నేడు ఓటర్ మంచు విష్ణు చంద్రగిరిలో ఓటు హక్కు వినియోగించుకొన్నారు.