కేటీఆర్, కవిత ఓటు వేశారు


తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్‌లో తన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. కేటీఆర్ సోదరి, ఎంపీ అభ్యర్థి కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె పొతంగల్‌లో ఓటు వేశారు.

మొత్తం 16ఎంపీ స్థానాలని గెలుచుకోవాలనే టార్గెట్ ని పెట్టుకొంది తెరాస. ‘కారు సారు పదహారు’ స్లోగన్ తో కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో విసృతంగా పర్యటించారు. రోడ్ షోలతో ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరీ.. 16 ఎంపీ సీట్ల తెరాస లక్ష్యం ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాలి.