‘వ్యూహం’ వెనక అసలు నిజాలు


ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు-నాని కథానాయకులు ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఐతే, ఇది మల్టీస్టారర్ కాదట. ఇందులో నాని గెస్ట్ రోల్ చేస్తున్నాడట. సినిమాపై హైప్ పెంచడానికి మాత్రమే ఇది మల్టీస్టారర్ అనే ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో అదితిరావు హైదరి, నివేదా థామస్ లు కథానాయకులుగా కనిపించనున్నారు. సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న చిత్రమిది. ‘వ్యూహం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాని దృష్టి అంతా ‘జెర్సీ’ పైనే ఉంది. ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చిన జెర్సీ టీజర్ కి మంచి స్పందన వస్తోంది.