అనంత మొత్తం మాదే : జేసీ


నిజాలు నిస్సుగ్గుగా మాట్లాడే నైజం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిది. అందుకే ఆయన నోరు తెరిస్తే సంచలనాలే. తాజాగా, అనంతపురం ఎన్నికల ఫలితాలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని అన్నీ స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుందని జోస్యం చెప్పారు జేసీ. డ్వాక్రా మహిళలకు సరైన సమయంలో అందిన చెక్కులు టీడీపీకి కలిసొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. అందుకే పెద్ద ఎత్తున మహిళ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారన్నారు.

రాష్ట్రంలో అర్ధరాత్రి దాకా ఓట్లు వేయడం అంటే రాష్ట్రంలో సైలెంట్ వేవ్ మహిళల్లో ఉందన్నారు. రాయలసీమలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒ లెక్క… ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఇంకో లెక్క అని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండ్రోజుల క్రితం వరకు అనంతపురం, శింగనమల, గుంతకల్లు అసెంబ్లీ సీట్లలో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని భావించాము. కానీ, పోలింగ్ రోజున మహిళల నుండి వచ్చిన స్పందన చూస్తే అనంతపురం ఎంపీ స్థానంలో అన్ని సీట్లను కైవసం చేసుకొంటామనే ధీమా కలిగిందన్నారు.