‘చిత్రలహరి’ తొలిరోజు కలెక్షన్స్

చిత్రలహరి ప్రేక్షకులని అలరిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌, పోసాని, సునీల్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ముఖ్య తారగణంతో చిత్రలహరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ ని అందుకొంది. దీంతో తొలిరోజు వసూళ్లు బాగున్నాయి. ఏకంగా రూ. 4కోట్ల షేర్ ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఏరియాల వారీగా చూస్తే.. నైజాం రూ. 0.86కోట్లు, సీడెడ్ రూ. 0.54కోట్లు, యుఎ రూ. 0.45కోట్లు, తూ. గోదావరి రూ. 0.39కోట్లు, ప. గోదావరి రూ. 0.26 కోట్లు, కృష్ణా రూ. 0.27 కోట్లు, నెల్లూరు రూ. 0.16కోట్లు, కర్ణాటక రూ. 0.35కోట్లు, యుఎస్ రూ. 0.45కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తంగా రూ. 4.21కోట్ల షేర్ ని తీసుకొచ్చింది. తేజుకు వరుసగా ఆరు ప్లాపుల్లో పడటంతో.. చిత్రలహరిని చాలా తక్కువ బడ్జెట్ తోనే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తొలివారంలోనే సినిమా పెట్టిన పెట్టుబడి తీసుకొచ్చేలా కనిపిస్తొంది.