గేల్‌ 99 నాటౌట్‌

ఐపీఎల్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఆడి ఆరు మ్యాచ్ లలో ఓడింది. ఏడో మ్యాచ్ మొహాలి వేదిక కింగ్స్‌ XI పంజాబ్‌ తో ఆడుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వెకెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. క్రిస్‌గేల్‌ (99, 64 బంతుల్లో 10×4, 5×6) చెలరేగడంతో పంజాబ్‌ భారీ స్కోర్‌ సాధించింది. గత మ్యాచ్ లో సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ 18 పరుగులకే అవుటయ్యాడు.

మయాంక్‌ అగర్వాల్‌(15), సర్ఫరాజ్‌ఖాన్‌(15) తక్కువ పరుగులకే ఔటయ్యారు. నిలకడగా ఆడిన గేల్ 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు, మొయిన్‌ అలీ, సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు. ఎప్పటిలాగే బెంగళూరు జట్టులో బౌలింగ్ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది.