టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ


ఢిలీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఈసీ సునీల్‌ అరోడాతో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ వ్యవహరించిన తీరు ఎంత ఆక్షేపణీయంగా ఉందో అర్థమవుతుందా .. అంటూ నిలదీశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై వివరణ ఇస్తామని అరోడా చెప్పనట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో తెదేపాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై తెదేపాకు చెందిన సాంకేతిక నిపుణులు హరిప్రసాద్‌తో చర్చించేందుకు అభ్యంతరం తెలిపింది. హరిప్రసాద్‌పై కేసు ఉన్న కారణంగా ఆయనతో చర్చించబోమని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇతర సాంకేతిక నిపుణులను పంపిస్తే మాత్రం చర్చించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది. అందుకోసం ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవవచ్చని తెదేపా న్యాయ విభాగం అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు.