బెంగళూరు గెలిచిందోచ్.. !

ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని అందుకొంది. మొహాలి వేదికగా శనివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (67: 53 బంతుల్లో 8×4), ఏబీ డివిలియర్స్ (59 నాటౌట్: 38 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో 175పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు సులభంగా చేధించింది.

మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వెకెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. క్రిస్‌గేల్‌ (99, 64 బంతుల్లో 10×4, 5×6) చెలరేగడంతో పంజాబ్‌ భారీ స్కోర్‌ సాధించింది. గత మ్యాచ్ లో సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ 18 పరుగులకే అవుటయ్యాడు. బెంగళూరు ఆడిన ఏడో మ్యాచ్ ఇది. ఆ జట్టుకు తొలి విజయం.