‘మన్మథుడు 2’లో సమంత.. నిజమే !

నాగ చైతన్య-సమంత మరోసారి మాయ చేశారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకొంది. అంతకుమించి చై, సామ్ నటనకి ప్రశంసలు దక్కాయి. ఈ ఆనందంలో ఈ జంట ఓ పత్రికకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

‘మజిలీ’ తర్వాత మరో సినిమాలో కలిసి నటిస్తున్నారా ? అన్న ప్రశ్నకి.. లేదని సమాధానం ఇచ్చారు. మజిలీ పక్కా ప్లానింగ్ కాదు. అలా జరిగింది. మజిలీ మమ్మల్ని మాయ చేసింది. అలాంటి మాయ మళ్లీ కలిగినప్పుడు కలిసి నటిస్తామన్నారు. మజిలీలో చైతూని బెస్ట్ ఫెర్ ఫామెన్స్. ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడ్డా. ఫైనల్ గా హ్యాపీ అంది సామ్. అంతేకాదు… మన్మథుడు 2 నటిస్తున్నారా.. ? అంటే అవునూ ఆ సినిమా చేస్తున్నానని చెప్పింది.

సమంత స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ హీరోగా మన్మథుడు2 తెరకెక్కుతోంది. ఇటీవలే సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో నాగ్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. సమంత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆమెది ఫుల్ లెన్త్ సినిమా కాదని తెలుస్తోంది. ఇక, చైతూ బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారట. ఇందులో నాగ్-చై తాతమనవళ్లుగా కనిపిస్తారు. ఇందులో అఖిల్ కూడా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదట.