ఢిలీపై హైదరాబాద్ ఓటమి


ఉప్పల్ లో హైదరాబాద్ ఓడిపోయింది. ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోరంగా ఓడింది. 156పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 15 ఓవర్లకు 100/2తో పటిష్ఠస్థితి లో కనిపించింది. మరో 3.5 ఓవర్లలో 16 పరుగులే చేసి చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 18.5 ఓవర్లలో 116 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 39 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది.

ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(51, 47 బంతుల్లో 3×4, 1×6), బెయిర్‌స్టో(41, 31 బంతుల్లో 5×4, 1×6) మినహాయించి మిగతా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు రాణించలేదు. దిల్లీ బౌలర్లలో రబాడా నాలుగు వికెట్లు తీయగా క్రిస్‌మోరిస్‌, కీమో పాల్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అంతకుముందు మన్రో(40), శ్రేయస్‌ అయ్యర్‌(45) రాణించడంతో దిల్లీ 155 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఖలీల్‌ 3, భువనేశ్వర్‌ 2 వికెట్లు తీయగా అభిషేక్‌ శర్మ, రషీద్‌ఖాన్‌ చెరో వికెట్‌ తీశారు.