పవన్ పై పూనమ్ ఫిర్యాదు

హీరోయిన్ పూనమ్ కౌర్ ఎన్నికల హీట్ తగ్గాక బయటికొచ్చింది. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో ఆమెని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో లింకుపెట్టి తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పవన్ గురించి ఆమె ఫోన్ లో మాట్లాడినట్లు కొందరు ఒక ఆడియో టేప్ ను సృష్టించడం సంచలనంగా మారింది. దీనిపై అప్పుడు స్పందించని పూనమ్.. ఇప్పుడు మాత్రం పోలీసులకి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనను మానసికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకున్నా ఎదో రకంగా పవన్ ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన పూనమ్ తెలియకుండానే వైరల్ అయ్యింది. సినిమాలతో కన్నా పవన్ తో లింకు ఉన్న హీరోయిన్ గా పూనమ్ ఫేమస్ అయిపోయింది. అవి తగ్గితే పూనమ్ కూడా తట్టుకోలేదు. బయటికొచ్చి.. ఆ పుకార్లు మళ్లీ మొదలయ్యేలా ఏదో ఒక పని చేస్తుంది. ఇప్పుడు పూనమ్ చేసింది కూడా అదే.. !