మోడీ ట్రైలర్ మాయం

ఎన్నికల ముందు ఎలాంటి బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’ విడుదలకి బ్రేక్ పడింది. ఐతే, ఇప్పుడీ సినిమా
ట్రైలర్‌ యూట్యూబ్‌లో కనిపించడం లేదు. యూట్యూబ్‌తోపాటు పలు ప్లాట్‌ఫాంలలో వీడియోను తీసేసినట్లు తెలుస్తోంది.

‘పీఎం మోదీ బయోపిక్‌ ట్రైలర్‌’ అని సెర్చ్‌ చేస్తుంటే.. ‘ఈ వీడియో అందుబాటులో లేదు’ అని వస్తోంది. మరి ఎవరు ట్రైలర్‌ తీసేశారో తెలియడం లేదు. ఇదిలావుండగా సినిమా విడుదలపై చిత్రబృందం సుప్రీం కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. కేవలం ట్రైలర్ ని చూసి సినిమాని ఎలా అడ్డుకొంటారు ? మొత్తం సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోమని చిత్రబృందం కోరింది. ఈసీ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని 24వ తేదీలోపు తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.