‘మా’ దువ్వుడు నిజమే !

మా అసోసియేషన్ ఇటీవల ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసింది. ప్రభుత్వ పథకాలని ప్రమోట్ చేస్తూ ప్రకటనలు చేసింది. అది కూడా ‘మా’ డబ్బులతో. దాదాపు రూ. 7.5లక్షలతో ప్రకటలని రూపొందించింది. ఐతే, ఆ డబ్బుని మొదట జీవిత రాజశేఖర్ కూతురు ఖర్చు పెట్టింది. తర్వాత మా నుంచి తీసుకొంది. ఇప్పుడీ వ్యవహారంపై దుమారం రేగుతోంది.

మా నుంచి డబ్బులు కొట్టేసే పని అప్పుడే మొదలైందని శివాజీ రాజా ప్యానల్ ఆరోపిస్తోంది. దీనిపై జీవిత రాజశేఖర్ వివరణ ఇచ్చింది. మా అసోసియేషన్ లో తాము అంతా నిబంధనల ప్రకారమే చేసింది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు వుంటే మా సంఘంలో వారికి కూడా అదేలా చేస్తామని హామీ ఇచ్చిందని, అందుకే తమ వంతుగా ఆ మంచి పథకాలకు ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు.

చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందిచామన్నారు. అలాంటి టైమ్ లో అధ్యక్షుడు నరేష్ వేరేచోట వుండడంతో, ప్రకటనలు చేసిన వారికి తాను క్యాష్ అడ్జస్ట్ చేసానని జీవిత వివరించారు. అందువల్ల మళ్లీ ఆ మొత్తాన్ని మా నుంచి తీసుకున్నామన్నారు. ఇంత తక్కువ మొత్తానికి ఎవ్వరూ ప్రకటనలు చేయించలేరని వివరించారు. మొత్తంగా..కేసీఆర్ ప్రభుత్వాన్ని మా దువ్వడం నిజమేనని తేలింది.