పబ్లిక్ గా జీవీఎల్‌’కు చెప్పు దెబ్బ

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుపైకి ఘోర అవమానం జరిగింది. ఆయన ఢిలీలోని భాజాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. చెప్పు విసిరిన వ్యక్తి పేరు శక్తి భార్గవ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వ్యక్తి. ఆయన ఈ పని ఎందుకు చేశాడన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ, శక్తి భార్గవ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి.

భార్గవ ఆస్పత్రితో పాటు పలు సంస్థలను నడుపుతున్నారు. లఖ్‌నవూ, కాన్పూర్‌, వారణాసిలోని ఆయన ఆస్తులపై 2018లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి, కొంత డబ్బు, నగదును స్వాధీనం చేసుకున్నారు. భార్గవ తన బ్యాంకు ఖాతా నుంచి రూ.11.5 కోట్లు చెల్లించారు. ఆ భవనాలను తనతో పాటు తన భార్య, పిల్లలు, బంధువుల పేర్ల మీద కొనుగోలు చేశారు. అయితే, వీటిని కొనుగోలు చేయడానికి ఆయనకు డబ్బు ఎలా వచ్చిందన్న విషయంపై ఆదాయపన్ను శాఖ అధికారులకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాదు.. భార్గవ తన సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీపై పదేపదే విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.