సికింద్రాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్ సర్కూట్ వల్ల ఏడో అంతస్తులో
మంటలు చెలరేగాయి. నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలని అదుపులోని తెచ్చారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాం జరగలేదు.

ఈ ప్రమాదంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్‌కు సంబంధించిన డ్రాయింగ్స్ కలిపోయినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రభావం రైళ్ల రాకపోకలపై ఏమైనా ప్రభావం చూపుతుందా ? అన్నది రైల్వే అధికారులు తెలియజేయాల్సి ఉంది.