గంగూలీ కేసు.. తీర్పు పెడింగ్ !

భారత మాజీ ఆటగాడు సౌరవ్‌ గంగూలీపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో దాదా దిల్లీ క్యాపిటల్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తుండటంతో బెంగాల్‌కు చెందిన ముగ్గురు క్రికెట్‌ అభిమానులు భాస్వతి శాంతౌ, అభిజిత్‌ ముఖర్జీ, రంజిత్‌ సీల్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయని జస్టిస్‌ డీకే జైన్‌ తెలిపారు.

‘నేను రెండు పక్షాల వాదనలు విన్నాను. బీసీసీఐ వాదనా విన్నాను. త్వరలోనే తీర్పు వెల్లడిస్తా. తుది తీర్పు వెల్లడించే ముందు రెండు పక్షాల నుంచి రాతపూర్వక జవాబులు సమర్పించాలని కోరాను’ అని జస్టిస్‌ డీకే జైన్‌ అన్నారు. సమావేశం చక్కగా జరిగింది. న్యాయ పరిధిలో ఉంది కాబట్టి విచారణలో ఏం జరిగిందో వెల్లడించలేనని గంగూలీ అన్నారు.