అమ్మ బర్త్ డే.. మహేష్ స్పెషల్ ట్విట్ !

ఏప్రిల్ 20 – సూపర్ స్టార్ మహేష్ కు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ? ఏప్రిల్ 20 మహేష్ అమ్మ ఇందిరా దేవి పుట్టిన రోజు. అమ్మ పుట్టినరోజైన ఈరోజు (ఏప్రిల్ 20) తన జీవితంలో ప్రత్యేకమైన రోజు అని మహేష్ ట్వీట్ చేశారు. అమ్మ ఫోటోని షేర్ చేశాడు.
గత యేడాది ఇదే రోజున మహేష్ ‘భరత్ అను నేను’ విడుదలైంది. “ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన సినిమాను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది” ఆ రోజు మహేష్ ట్విట్ చేశారు.

ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహర్షి రూ. 140కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు.