‘సరైనోడు’కు మూడేళ్లు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సూపర్ హిట్ అయింది. ఇందులో బన్నీకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు నటించారు. థమన్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ నిర్మించింది. టాక్ తో సంబంధం లేకుండా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదలై నేటితో మూడేళ్లు అవుతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్విట్ చేసింది. సరైనోడు మూడేళ్ల పోస్టర్ ని షేర్ చేసింది.

సరిగ్గా మూడేళ్లకి గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ హీరోగా మరో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమాని గీతా ఆర్ట్స్, హారికా & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. #AA19తో అల్లు అర్జున్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు థమన్ ట్విట్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు.