మహేష్ పొలం బాట


సూపర్ స్టార్ మహేష్ పొలం బాట పట్టాడు. రైతులతో కలిసి అడవిని చదును చేసి సాగు చేసేందుకు పయనమయ్యాడు. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో మహేష్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్ లుక్స్ బయటికొచ్చాయి. తాజాగా మహేష్ రైతు లుక్ బయటికొచ్చింది.

మహర్షి నాలుగో పాటని రేపు (ఏప్రిల్ 24) సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నారు. ఇది మహేష్ రైతుగా కనిపించే నేపథ్యంలో వచ్చే సాంగ్. ఈ పాట విడుదల ముహూర్తం తెలుపుతూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ నాగలి, గడ్డపార, కొడ్డలి.. పట్టుకొని రైతుబృందంతో కలిసి అడవిని చదను చేసి సాగు చేయడానికి బయలుదేరుతున్నాడు.

“పదరా పదరా పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా.. “ అంటూ సాగే పాటని రేపు వినబోతున్నాం.

ఈ సినిమాలో మహేష్ జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.