రకుల్’కి ఎవ్వరైనా ఒక్కటే.. !

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలు, కుర్ర హీరోలని చూడటం లేదు. తనకి ఎవ్వరైనా ఒక్కటే అంటోంది.
ప్రస్తుతం రకుల్ నాగార్జునతో రొమాన్స్ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మన్మథుడు 2’లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా ఇందులో నాగ్ రకుల్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేస్తాడట.

నాగ్ తర్వాత బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు రకుల్ ఓకే చెప్పేసింది. బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ఫిక్సయింది. అలాగని సీనియర్ హీరోలతో రకుల్ సరిపెట్టుకోవడం లేదు. యంగ్ హీరోల వైపు చూస్తోంది. నితిన్ తో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రకుల్ ని తీసుకొన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ప్రస్తుతం రకుల్ ‘మన్మథుడు2’తో పాటు బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్‌ దే’లో నటిస్తోంది. అజయ్ దేవగణ్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో రకుల్ ఏ రేంజ్ లో యెద అందాలు ఆరబోస్తుంది. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులని చూపించని అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకొనే ప్రయత్నంలో రకుల్ ఉంది. ఇకపై కూడా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొంటోంది రకుల్.