జగన్’పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం విషమం


ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు సమాచారమ్. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాస్ కు సోమవారం రాత్రి తీవ్రమైన ఛాతినొప్పి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఐతే, పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. శ్రీనివాస్ ని కాకినాడ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించేందుకు రెడీ అయినట్టు సమాచారమ్. ఐతే, శ్రీనివాస్ అనారోగ్యం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం పలు అనుమనాలకి తావునిస్తోంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాస్ కోడికత్తితో జగన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఈ దాడి ఏపీలో రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే.