కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్ట్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్ట్ అంటూ విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది. వీరిలో 10మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. సీఎల్పీని తెరాసలో విలీనం చేసేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మంగళవారం స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం క్విడ్ ప్రో కో కిందకే వస్తాయి. ఫిరాయింపులకు వ్యతిరేకంగా అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామన్నారు భట్టి. కాంగ్రెస్‌ను వీడే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు.