వైరల్ : ధోని భార్య పాడుపని

మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి పాడుపని చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ సాక్షి ఏం చేసిందో తెలుసా ? చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు మోను కుమార్‌ ని ముద్దాడింది. మోను బట్టలపై ముద్దుపెడుతున్న ఫోటోని సాక్షి తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికి ‘బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్‌ పచ్చగా లేదనుకుంటా.. ‘అంటూ కామెంట్ పెట్టింది. సింపుల్ గా చెప్పాలంటే మోను బట్టతలపై సాక్షి సటైర్ వేసింది అన్నమాట. సాక్షి సటైర్ నెటిజన్లకి నచ్చలేదు.

ఏంటీ.. సాక్షి ఇలాంటి పాడుపని చేశావ్. మీ పోస్ట్ మమ్మల్ని బాధించింది. మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం సాక్షి దారిలోనే మోను బట్టతలపై సటైర్లు వేస్తున్నారు. ఫ్లాట్‌ పిచ్‌ బాగుంది బ్యాటింగ్‌కు పనికొస్తుంది అంటూ సెటైర్లు వదులుతున్నారు. ఈ ఫోటోలో సాక్షి మోనుకు చాలా ఇష్టంగా ముద్దుపెడుతున్నట్టు కనిపించడం ధోనీ అభిమానులని బాధ పెట్టినట్టు అనిపిస్తోంది.