‘మహర్షి’ కోసం 24మంది దర్శకులు !

సూపర్‌స్టార్‌ మహేష్ నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మించారు. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని మే 1న ప్లాన్ చేశారు. మే 1న నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరగబోతోంది.

ఈ వేడుకకి అతిథులుగా.. మహేశ్‌ ఇప్పటివరకు నటించిన 24 సినిమాల దర్శకులంతా హాజరుకాబోతున్నారని తెలుస్తోంది.
1999లో ‘రాజకుమారుడు’ చిత్రంతో మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కే.రాఘవేంద్రరావు నుంచి 2019లో విడుదల కాబోతున్న ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి వరకు మహేశ్‌తో కలిసి పనిచేసిన అందరు దర్శకులు ఒకే వేదికపై కనువిందుచేయబోతున్నారని సమాచారం. ఇదే జరిగితే ప్రిన్స్ ఫ్యాన్స్ కి పండగే.