టీడీపీ తగ్గింది.. 70పాటలో ఉంది !


టీడీపీ గెలుపు పాట పాడుతోంది. ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఎన్నికలు ముగియగానే టీడీపీ ఏకంగా 150 సీట్లు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ సంఖ్యని 110కి తగ్గించారు. ఒకట్రెండు రోజుల గడిచాక.. ఆ పాటని 110 నుంచి 140కి పెంచారు. ఐతే, ఇటీవల పార్టీ ముఖ్య నాయకులు, కార్తకర్తలతో నిర్వహించిన సమీక్షలో అసలు విషయం తెలిసొచ్చింది. బోటాబోటీగా అధికారంలోకి రావొచ్చని తేలింది. అయినా.. చంద్రబాబు ధీమా వందకు తగ్గడంలేదు.

పార్టీ కీలక నేతలు మాత్రం తమకు 70 నుంచి 90 స్థానాలు కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. జనసేనతో కలిసి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ టీడీపీ గెలుపు ధీమా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు, జాతీయ సర్వేలు జగన్ కి అనుకూలంగా వస్తున్నాయి. మే 23 తర్వాత చంద్రబాబుకు రిటైర్డ్మెంట్ తప్పదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి కాబోయే కొత్త సీఎం జగన్ నే టాక్ బలంగా వినిపిస్తోంది. మరీ.. ఏం జరుగుతుందన్నది చూడాలి.