స్వామిజీతో సీఎం చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి కలిసి.. ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో వీరి భేటీ జరిగింది. ఆధ్యాత్మికం, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జూన్ లో స్వరూపానందేంద్రస్వామి విశాఖ శారదపీఠం ఉత్తరాధికారి బాధ్యతలని స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమాని స్వామిజీ సీఎం కేసీఆర్ ని ఆహ్వానించారు.

సీఎం కేసీఆర్ కు ముహూర్తాలు, జ్యోతిష్యాలపై గట్టి నమ్మకం. ముహుర్తాలు చూసుకోనిదే.. ఏ పని చేయరు. ముహూర్త బలం చూసుకొనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్టు చెబుతుంటారు. యజ్ఝయాగాలని నిర్వహిస్తుంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు, తర్వాత కూడా కేసీఆర్ యాగాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, సీఎం కేసీఆర్ కు జాతకాల పిచ్చని ఆయని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ ముహూర్త బలాలపై, యజ్ఝ యాగాలపై సటైర్లు వేసిన సంగతి తెలిసిందే.