నటుడు బోస్ కన్నుమూత


టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకొంది. నటుడు పి.సుభాష్ చంద్రబోస్‌ అలియాస్ బోస్ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్‌లోని తన ఇంట్లో బోస్ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఆయన తలకు తీవ్ర గాయమైంది. గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి.. ఆదివారం తుదిశ్వాస విడిచారు.

సుమన్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1990లో వచ్చిన ‘సాహసపుత్రుడు’ సినిమాతో ఇండస్ట్రీ పరిచయం అయ్యాడు బోస్.
‘ప్రేమఖైదీ’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కనిపించారు. ఈవీవీ సత్యనారాయణ ‘చెవిలో పువ్వు’లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ‘ప్రతిబంధ్‌’ (హిందీ), ‘కొదమ సింహం’ సినిమాల్లోనూ బోస్ నటించారు.

పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ చిత్రాల్లో బోస్ ఎక్కువగా కనిపించారు. పలు టీవీ సీరియల్స్ లోనూ నటించారు. పూరితో బోస్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. పూరి సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కృష్ణానగర్ లో ఇద్దరం కలిసి టీ తాగేవాళ్లమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు బోస్. ఇక, కృష్ణ వంశీ గులాభి సినిమా నుంచి ప్రతి సినిమాలో కనిపించారు బోస్. డేంజర్ తర్వాత కృష్ణవంశీ చేసిన సినిమాల్లో మాత్రం బోస్ కనిపించలేదు. బోస్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.