కామ్రేడ్ పని పూర్తయ్యింది

విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడు. మే31న విడుదల కానుంది. ఆదివారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు భరత్ కమ్మ ట్విట్ చేశారు. “ప్యాకప్!! డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తయింది! సుమారు ఏడాదిపాటు షూటింగ్‌ను చాలా గొప్పగా చేశాం. అందరినీ మిస్సవుతున్నా”నని రాసుకొచ్చాడు.

కాలేజీ రాజకీయాలు, ప్రేమ నేపథ్యంలో సాగే చితమిది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. టీజర్ లో విజయ్-రస్మికల లిప్ లాక్ సీన్ హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క సీన్ చాలు సినిమా ప్రమోషన్స్ కోసం అన్నట్టుగా ఉంది. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్-రస్మిక జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో.. డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలున్నాయి. దక్షిణాదిన అన్ని బాషల్లో మే31 సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.