‘సాహో’ పునర్జన్మల కథ.. ?


ప్రభాస్ ‘సాహో’ ఓ యాక్షన్ థ్రిల్లర్. కేవలం యాక్షన్ సీన్స్ కోసమే రూ. 100కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రభాస్ చేసే యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు మునెపెన్నడూ చూడని విధంగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. యాక్షన్ హైలైట్ గా సినిమా ఉంటుందని చెబుతున్నారు. తప్ప కథ ఏంటన్నది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. బలమైన కథతో సాహో సినిమా తెరకెక్కుతోందని ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. సాహో పునర్జన్మల కథ. మరణించి మళ్లీ జన్మించిన ప్రభాస్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
ప్రభాస్ ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఐతే, చిత్రబృందం మాత్రం సాహో యాక్షన్ థ్రిల్లర్. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని మాత్రమే చెబుతోంది. కథ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ లో ఉంచుతోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం కావడంతో సాహోపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. ప్రభాస్ కి జంటగా శ్రద్దా కపూర్ నటిస్తోంది. సినిమాలో శ్రద్దాపై కూడా యాక్షన్స్ సీన్స్ ఉంటాయట. నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్, అర్జున్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఆగష్టు 15న ‘సాహో’ ప్రేక్షకులు ముందుకు రానుంది.