బ్రేకింగ్ : మోడీకి ఈసీ క్లీన్ చీట్

ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్ చీట్ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడు లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడంపై ప్రధాని చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

తాజాగా, ఈ వ్యవహారంలో ప్రధాని మోడీకి క్లీన్ చీట్ ఇస్తూ ఈసీ ప్రకటన చేసింది. మోడీ మాటలు రెచ్చగొట్టేలా లేవని ఈసీ అభిప్రాయపడింది. ఇక, రాహుల్ విషయానికొస్తే.. ఆయన ఆమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వయనాడ్ లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.