అన్నదమ్ముళ్లే స్పెషల్ అట్రాక్షన్ !

మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో అన్నదమ్ముళ్లు వెంకీ-మహేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఓ సన్నివేశం ఉంటుంది. చెల్లి పెళ్లి తర్వాత తొలిసారి చిన్నోడు (మహేష్ బాబు) వాళ్లింటికి వెళ్తాడు. తిరిగొచ్చే సమయంలో మామయ్య చిన్నోడి ఓ మాట చెబుతాడు. పెళ్లిలో మీరిద్దరే స్పెషల్ అట్రాక్షన్. ఎప్పటికీ ఇలాగే ఉండండని చెబుతాడు. ఆ సీన్ ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలోనూ పెద్దోడు-చిన్నోడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకి వెంకీ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వెంకీ.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సీన్ ని గుర్తు చేశాడు. ఆ సినిమాలో మహేష్ తనపై కోపంతో పూలకుండిని తన్నాడు. అది సూపర్ హిట్ అయ్యింది. ఆ రేంజ్ లో మహర్షి కూడా హిట్ కావాలని ఆకాక్షించాడు. ఇక, మహేష్ తన ప్రసంగంలో పెద్దోడుకి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. ఇండస్ట్రీలో అందరికీ కంటే వెంకీనే ఇష్టం. ఆయన ఎనర్జి చాలా పాజిటివ్ గా ఉంటది. ఆయన సెట్ కి వెళ్లిన, ఏ ఫంక్షన్ కి వెళ్లినా.. సినిమా సూపర్ హిట్ అంటుంటారు. పిలవగానే వచ్చినందు థ్యాంక్స్ అన్నారు