భట్టి విక్రమార్కకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

తెలంగాణ కాంగ్రెస్‌ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలిందని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం భట్టీ ఆరోగ్యం నిలకడగా ఉంది.

గత మూడు రోజులుగా భట్టి జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి పార్టీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఆయా నియోజవర్గాల్లో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో భటీ, ఇతర కాంగ్రెస్ నేతలు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయపార్టీని తెరాస ఎలా విలీనం చేస్తారని ప్రశ్నిస్తున్నారు భటీ. ఇప్పుడీ వ్యవహారం కోర్టు తీర్పుని వెల్లడించాల్సి ఉంది.