ఫొని ఎఫెక్ట్ : ప్రెగ్నెంట్ మహిళల కష్టాలు


ఏపీకి ఫొని గండం గడిచింది. ప్రస్తుతం ఫొని పూరి వద్ద తీరం దాడుతోంది. ఈ ఉదయం 11గంటల సమయంలో ఫొని పూర్తిగా తీరం దాటనుంది. ఆ సమయంలో 200కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు, ఫొని ముప్పు నుంచి తప్పించుకొనేందు ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. దాదాపు 11లక్షల మందికి పైగా వసతి గృహాలకు తరలించారు. ఐతే, గజాంలో 500మందికి పైగా గర్భవతి మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఒడిషా ప్రభుత్వం తెలిపింది.