కాళేశ్వరానికి మల్లన్నసాగర్‌ గుండెకాయ

కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్‌ ఓ గుండెకాయ లాంటిదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మల్లన్నసాగర్ జలాశయం పనుల్లో పురోగతి, భూనిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై సీఎం సమీక్ష నిర్వహించారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయిందన్న ముఖ్యమంత్రి మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సీఎస్‌ ఎస్కే జోషీని ఆదేశించారు.

ఈ నెల 11లోపు మల్లన్నసాగర్ బాధితులకి పరిహారం, పునరావాసం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని నిర్దేశించారు. పునరావాసం ప్రక్రియను సీఎస్‌ స్వయంగా పర్యవేక్షించాలన్నారు. అందుకోసం గ్రామాల వారీగా శిబిరాలను నిర్వహించాలని సూచించారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని, ఉపాధి, పునరావసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే ప్యాకేజీని ఇస్తామని భరోసా ఇచ్చారు.